దేవెగౌడ,కుమారస్వామితో కేసీఆర్ భేటీ..జాతీయ రాజకీయాలపై మంతనాలు..!
- May 26, 2022
* దేశ రాజకీయాలపై చర్చిస్తున్న కేసీఆర్
* రాష్ట్రపతి అభ్యర్థిపై కూడా కొనసాగుతున్న చర్చ
బెంగళూరు: సీఎం కెసిఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న ఆయన దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి కూడా చర్చలు జరుపుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!









