భారత్ కరోనా అప్డేట్
- May 27, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగా 2,710 కేసులు వెలుగుచూశాయి. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు . ఒక్కరోజే 2,296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారినపడి కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. దేశవ్యాప్తంగా గురువారం 14,41,072మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 192,97,74,973కు చేరింది. ఒక్కరోజే 4,65,840 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే మాత్రం స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,67,240 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 1,427 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,01,57,770కు చేరింది. మరణాల సంఖ్య 63,07,663కు చేరింది. ఒక్కరోజే 5,97,520 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,06,7,229గా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







