ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభం
- May 27, 2022
అమరావతి: నేడు ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయ్యింది. టీడీపీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆశీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ప్రసంగాలను, చర్చలను ప్రారంభిస్తారు.
మరోవైపు, పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ 40 వసంతాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికపైనే అని తెలిపారు. తాను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టమని అన్నారు. తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం అని అన్నారు.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









