పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కీలక నిర్ణయం

- May 28, 2022 , by Maagulf
పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్  కీలక నిర్ణయం

అమృత్‌సర్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల లంచం అడిగానే ఆరోపణలు రావడంతో ఏకంగా మంత్రినే క్యాబినెట్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.వారిలో పదవీ విరమణ పొందిన పోలీసులు, మత నాయకులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.

కాగా, ఏప్రిల్‌ నెలలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సహా 184 మందికి భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.వీరిలో పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కుటుంబ సభ్యులు, అమరిందర్‌ సింగ్‌ కుమారుడు, అతని భార్య, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌ సింగ్‌ బజ్వావర్‌ కూడా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com