NRI TDP కువైట్ అధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
- May 28, 2022కువైట్ సిటీ: విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు, నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు మే 27న శుక్రవారం కువైట్ లో యన్.ఆర్.ఐ.తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది.ఈ మహానాడులో అమరులైన నాయకులకు, కార్యకర్తలకు, ఇతరులకు సంతాప సూచకంగా సభకు హాజరైన ప్రతినిధులు, పరిశీలకులు, అతిథులు, ప్రజలు యన్.ఆర్.ఐ.తెలుగుదేశం కువైట్ మహాసభలో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారని యన్.ఆర్.ఐ.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలిపారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీ MLC, రాజంపేట నియోజక వర్గం ఇంచార్జ్,బత్యాల చాంగల్ రాయుడు ముఖ్య అతిధిగా, చంద్రశేకర్ రాజుగారు, బలరాం నాయుడు,కె. నరసింహ నాయుడు, యనిగల బాలకృష్ణ ,సాయి సుబ్బారావు.కె,పార్ధసారధి, రత్నం నాయుడు తుమ్మల, ప్రసాద్ పాలేటి,ఆవుల చిన్నయ్య యాదవ్, ఈరాతి శంకరయ్య, శీను , గుండయ్య నాయుడు, పసుపులేటి విజయకుమార్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకట రమణ, రాచూరి మోహన్(NRITDP కువైట్, జాయింట్ సెక్రెటరీ), మల్లి కార్జున్ నాయుడు(NRITDP కువైట్ తెలుగుయువత అధ్యక్షులు), వలసాని శంకర్ యాదవ్ (NRITDP కువైట్ బీసీ అధ్యక్షులు), బొమ్మునరసింహా, (NRITDP కువైట్ బీసీ అధ్యక్షులు), రాణి చౌదరి(NRITDP కువైట్ మహిళా అధ్యక్షురాలు), ఇందు (NRITDP కువైట్ మహిళావిభాగం కార్యదర్శి),వెలిగండ్ల శ్రీనివాసరాజు(NRITDP కువైట్ వుపాధ్యక్షులు), మురళి నాయుడు (NRITDP కువైట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి), రమేష్ కొల్లపనేని (NRITDP కువైట్ తెలుగుయువత ప్రోగ్రాం Co-ordinator), జనార్ధన్ గుండ్ల పల్లె (NRITDP కువైట్ బీసీ వుపాధ్యక్షులు),పెంచలయ్య పెరుమాల (NRITDP కువైట్ బీసీ ప్రధాన కార్యదర్శి) మరియు కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సలహాదారులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారని యన్.ఆర్.ఐ.తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్