ఇరాక్ను వణికిస్తోన్న ప్రాణాంతక కాంగో ఫీవర్
- May 30, 2022
ఇరాక్: కాంగో ఫీవర్తో ఇరాక్ వణుకుతోంది. దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.
నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







