భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్ప్రెస్’ రైలు ప్రారంభం
- June 01, 2022
భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ..రెండు దేశాల మధ్య మరో కీలక అడుగు పడింది. భారత్లోని పశ్చిమబెంగాల్లోని న్యూ జలపాయ్గురి..నుంచి బంగ్లాదేశ్లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ ‘మిటాలి ఎక్స్ప్రెస్’ (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది. బుధవారం భారత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్లు బుధవారం ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు.ఈమేరకు బెంగాల్లోని న్యూ జలపాయ్గురి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమాలో ఇరు దేశాల మంత్రులు పాల్గొన్నారు.న్యూ జలపాయ్గురి–ఢాకా కంటోన్మెంట్ మధ్య..బుధ, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
కాగా, ఇప్పటికే భారత్–బంగ్లాదేశ్ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా..బుధవారం మరో ప్రత్యేక రైలు ఇరుదేశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని ఢాకా వరకు మైత్రీ రైలు, కోల్కతా నుంచి ఖుల్నా వరకు బంధన్ ఎక్స్ప్రెస్ అనే రెండు రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన ‘మిటాలి ఎక్స్ప్రెస్’ భారత్లో 69 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో 526 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







