ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాలను సందర్శించిన మహ్మద్ బిన్ జాయెద్
- June 05, 2022
యూఏఈ: షార్జా ఎమిరేట్లోని ఖోర్ ఫక్కన్, అల్ దైద్ నగరాల్లో అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలను ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. పర్యటనలో భాగంగా అల్ దైద్ కోటను కూడా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. ఇది 1820 నాటిది.. అల్ దైద్ నగర పురాతన చరిత్రకు సాక్ష్యంగా ఉంది. ఈ పర్యటనలో ఖోర్ ఫక్కన్ నగరంలో అల్ రఫీసా డ్యామ్ వంటి అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రెసిడెంట్ సందర్శించారు. ఇవి దేశంలోని అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెంట ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







