ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాలను సందర్శించిన మహ్మద్ బిన్ జాయెద్
- June 05, 2022యూఏఈ: షార్జా ఎమిరేట్లోని ఖోర్ ఫక్కన్, అల్ దైద్ నగరాల్లో అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలను ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. పర్యటనలో భాగంగా అల్ దైద్ కోటను కూడా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. ఇది 1820 నాటిది.. అల్ దైద్ నగర పురాతన చరిత్రకు సాక్ష్యంగా ఉంది. ఈ పర్యటనలో ఖోర్ ఫక్కన్ నగరంలో అల్ రఫీసా డ్యామ్ వంటి అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రెసిడెంట్ సందర్శించారు. ఇవి దేశంలోని అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెంట ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…