ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాలను సందర్శించిన మహ్మద్ బిన్ జాయెద్
- June 05, 2022
యూఏఈ: షార్జా ఎమిరేట్లోని ఖోర్ ఫక్కన్, అల్ దైద్ నగరాల్లో అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలను ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. పర్యటనలో భాగంగా అల్ దైద్ కోటను కూడా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. ఇది 1820 నాటిది.. అల్ దైద్ నగర పురాతన చరిత్రకు సాక్ష్యంగా ఉంది. ఈ పర్యటనలో ఖోర్ ఫక్కన్ నగరంలో అల్ రఫీసా డ్యామ్ వంటి అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రెసిడెంట్ సందర్శించారు. ఇవి దేశంలోని అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెంట ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









