10 మిలియన్ దిర్హామ్ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల పట్టివేత
- April 08, 2016
దుబాయ్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (డిఇడి) ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సెక్షన్ సోమవారం 47000 నకిలీ మొబైల్ ఫోన్లు, 99,000 మొబైల్ ఫోన్ ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నారు. 110,000 బ్యాటరీలు కూడా పోలీసులకు దొరికాయి. వీటి మొత్తం విలువ 10 మిలియన్ దిర్హామ్లు ఉంటుందని అంచనా వేశారు. ఓ హోటల్ అపార్ట్మెంట్లో వీటిని తయారు చేశారనీ, అది రీ ప్యాకేజింగ్ సెంటర్గా అనుమానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ హోటల్ నుంచి నకిలీ వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం ఇదే రతొలిసారి అని అధికారులు చెప్పారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీమ్ బెహ్జాద్ మాట్లాడుతూ, నిబంధనల్ని ఉల్లంఘించి ఆ హోటల్ కమర్షియల్ ఫ్రాడ్కి తెరలేపిందని అన్నారు. నకిలీ వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









