10 మిలియన్ దిర్హామ్ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల పట్టివేత
- April 08, 2016
దుబాయ్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (డిఇడి) ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సెక్షన్ సోమవారం 47000 నకిలీ మొబైల్ ఫోన్లు, 99,000 మొబైల్ ఫోన్ ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నారు. 110,000 బ్యాటరీలు కూడా పోలీసులకు దొరికాయి. వీటి మొత్తం విలువ 10 మిలియన్ దిర్హామ్లు ఉంటుందని అంచనా వేశారు. ఓ హోటల్ అపార్ట్మెంట్లో వీటిని తయారు చేశారనీ, అది రీ ప్యాకేజింగ్ సెంటర్గా అనుమానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ హోటల్ నుంచి నకిలీ వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం ఇదే రతొలిసారి అని అధికారులు చెప్పారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీమ్ బెహ్జాద్ మాట్లాడుతూ, నిబంధనల్ని ఉల్లంఘించి ఆ హోటల్ కమర్షియల్ ఫ్రాడ్కి తెరలేపిందని అన్నారు. నకిలీ వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







