ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోడీ
- June 06, 2022
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ చేపట్టిన ఐకానిక్ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. 12 ప్రభుత్వ పథకాల్లో భాగంగా యువత, వ్యాపారులు, రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘జన సమర్థ్ పోర్టల్’ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. కేంద్రం సమకూర్చిన పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, ఉచిత వైద్యం.. పేదల గౌరవాన్ని పెంచాయని తెలిపారు. అంతర్జాతీయ వ్యాపారం, సరఫరా గొలుసులో భారత దేశ బ్యాంకులతోపాటు కరెన్సీకి కీలక భాగస్వామ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మోడీ పిలుపునిచ్చారు.
“స్వాతంత్ర్య దినోత్సవ 75ఏళ్ల ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశ అభివృద్ధి కోసం తమ తమ స్థాయిల్లో కృషి చేయడం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. ఆర్థిక సమ్మిళిత కోసం మేము ఒక వేదికను తయారు చేశాం. దాని ఉపయోగాల గురించి అవగాహన పెంచాలి. మన బ్యాంకులు, కరెన్సీ.. అంతర్జాతీయ సరఫరా గొలుసు, వ్యాపారంలో కీలక భాగస్వామి కావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.” అంధులు సులభంగా గుర్తించే వీలున్న కొత్త సిరీస్ నాణేలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువగల నాణేలు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్ను కలిగి ఉంటాయని తెలిపారు. అయితే ఇవి కేవలం స్మారక నాణేలు కావని.. చలామణీలో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కొత్త సిరీస్ నాణేలు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లక్ష్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తాయని, దేశ అభివృద్ధికి కృషి చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







