భారత ఉపరాష్ట్రపతిని కలిసిన షురా కౌన్సిల్ స్పీకర్

- June 07, 2022 , by Maagulf
భారత ఉపరాష్ట్రపతిని కలిసిన షురా కౌన్సిల్ స్పీకర్

దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్  వెంకయ్య నాయుడుతో షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్ సమావేశమయ్యారు. దోహాలోని భారత ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం ఇండియా వైస్ ప్రెసిడెంట్  వెంకయ్య నాయుడు ఖతార్ లో అధికార పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖతార్, భారతీయ ప్రజల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను వారు గుర్తు చేసుకున్నారు. అలాగే భారతదేశంలోని అధికార పార్టీలోని ఒక నేత ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఖతార్ ప్రజల అసంతృప్తిని భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటివి ప్రజల మధ్య సయోధ్యకు సహాయపడవని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com