దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు

- June 07, 2022 , by Maagulf
దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు

దుబాయ్: భారత ప్రవాసుడు చేసిన పనికి దుబాయ్ పోలీసులు ప్రశంసించారు.1మిలియన్ దిర్హాములు నగదుతో ఉన్న బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు మనోడు. దాంతో భారత వ్యక్తి నిజాయితీని మెచ్చుకుని దుబాయ్ పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రశంస పత్రం అందజేశారు.అల్ బార్షా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో తారిఖ్ మహమూద్ ఖలీద్ మహమూద్ అనే భారత ప్రవాసుడు నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బిల్డింగ్‌కి సంబంధించిన ఎలివేటర్‌లో తారిఖ్‌కు ఓ బ్యాగ్ కనిపించింది. తెరిచిచూస్తే దాని నిండా నగదు ఉంది. దాంతో వెంటనే అల్ బార్షా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అయితే, భారత వ్యక్తి బ్యాగ్ తీసుకెళ్లి ఇవ్వడానికి కొన్ని గంటల ముందు అదే పోలీస్ స్టేషన్లో ఓ అరబ్ వ్యక్తి  1మిలియన్ దిర్హాములు నగదుతో ఉన్న తన బ్యాగ్ ఒకటి పోయినట్లు ఫిర్యాదు చేశాడు. అది కూడా అప్పుగా తీసుకున్న సొమ్ముగా అతడు పేర్కొన్నాడు. 

ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే తారిఖ్ ఓ బ్యాగ్ తీసుకెళ్లి ఇచ్చాడు.తాను నివాసముండే బిల్డింగ్ ఎలివేటర్‌లో అది దొరికినట్లు తెలిపాడు. దాంతో వెంటనే పోలీసులు అంతకుముందు తమకు బ్యాగ్ మిస్సింగ్ విషయమై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి వెంటనే అల్ బార్షా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆ బ్యాగ్ తనదేనని కన్‌ఫార్మ్ చేశాడు. అంతేగాక అందులో రూ.2.11కోట్లు ఉన్నట్లు తెలిపాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ బ్యాగ్‌లో ఉన్న నగదును లెక్కించారు. అతను చెప్పినట్టుగానే అవి సరిగ్గా 1మిలియన్ దిర్హాములుగా లెక్క తేలింది. పోలీసులు ఆ బ్యాగ్‌ను అరబ్ వ్యక్తి అప్పగించారు. అనంతరం నిజాయితీ చాటిన భారత ప్రవాసుడికి ప్రత్యేక ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ రహీమ్ బిన్ షఫీ మాట్లాడుతూ తారిఖ్ మహమూద్‌పై ప్రశంసలు కురిపించారు. భారత ప్రవాసుడు చేసిన పనికి మెచ్చుకున్నారు. దుబాయ్‌లో ఉన్న ప్రవాసులందరూ గర్వంగా చెప్పుకునే పని చేశాడంటూ ప్రశంసించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com