భారత్ కరోనా అప్డేట్
- June 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
ప్రస్తుతం దేశంలో 1.62 శాతం రోజువారీ పాజిటివిటీ రేటుతో, 32,498 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎప్పట్లాగే మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలో 2,701 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 1,765 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో బీఏ5 వేరియెంట్ కూడా ఉంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసుల పెరుగుదల 40 శాతం ఉండగా, మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా మరో 40 శాత కరోనా కేసులు పెరిగాయి. బుధవారం కరోనా నుంచి 3,591 మంది కోలుకున్నారు. తమిళనాడులో 195, ఢిల్లీలో 564, ఒడిశాలో 15, మిజోరంలో 15 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. పలు రాష్ట్రాలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశాయి. గడిచిన 24 గంటల్లో 15.4 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. వీరిలో నాలుగు లక్షల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. 3 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తైంది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







