భారత్ కరోనా అప్డేట్
- June 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
ప్రస్తుతం దేశంలో 1.62 శాతం రోజువారీ పాజిటివిటీ రేటుతో, 32,498 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎప్పట్లాగే మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలో 2,701 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 1,765 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో బీఏ5 వేరియెంట్ కూడా ఉంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసుల పెరుగుదల 40 శాతం ఉండగా, మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా మరో 40 శాత కరోనా కేసులు పెరిగాయి. బుధవారం కరోనా నుంచి 3,591 మంది కోలుకున్నారు. తమిళనాడులో 195, ఢిల్లీలో 564, ఒడిశాలో 15, మిజోరంలో 15 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. పలు రాష్ట్రాలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశాయి. గడిచిన 24 గంటల్లో 15.4 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. వీరిలో నాలుగు లక్షల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. 3 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తైంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి