భారత ప్రవాసులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- June 09, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. పాస్పోర్ట్, వీసా సేవలను అందించే జలీబ్(అబ్బాసియా), ఫహాహీల్లోని బీఎల్ఎస్ ఔట్సోర్సింగ్ కేంద్రాలను తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ రెండు సెంటర్లు మూసే ఉంటాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.అయితే,కువైట్ సిటీలోని అలీ అల్ సేలం స్ట్రీట్లోని జవహార్ టవర్స్లో ఉన్న మూడో కేంద్రం మాత్రం ఇకపై 24/7 తెరిచే ఉంటుందని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రవాసులు వీసా, పాస్పోర్టు తాలూకు దరఖాస్తులను ఈ కేంద్రంలో సమర్పించాలని కోరారు.ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్రకటన చేసింది. ప్రవాసులు దీన్ని దృష్టిపెట్టుకుని అసౌకర్యానికి గురి కాకుండా ముందే ప్రణాళిక ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.కువైట్ సిటీ బీఎల్ఎస్ సెంటర్లో దరఖాస్తు సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్న ప్రవాసులు 65506360 నం.కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







