6గురు కేబుల్ దొంగల అరెస్ట్
- April 09, 2016
ఆరుగురు సభ్యులు గల కేబుల్ దొంగల ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబుదాబీ మరియు రస్ అల్ ఖైమాలో ఈ ఆరుగురు కేబుల్స్ని దొంగిలిస్తున్నారు. దొంగిలించిన వాటిని స్పేర్ పార్ట్స్ రూపంలో విక్రయించడానికి సిద్ధమవుతుండగా వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించిన కేబుల్స్ని నిందితులు దొంగిలించారనీ, అవి అబుదాబీలోని కన్స్ట్రక్షన్ ఫెసిలిటీకి చెందినవనీ కల్నల్ అహ్మద్ సైఫ్ బిన్ జీతౌన్ అల్ ముహైరి చెప్పారు. దొంగిలించబడిన కేబుల్స్ విలువ 100,000 దిర్హామ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం 500 కిలోల బరువైన ఈ కేబుల్స్ని నిందితులు రాత్రి వేళ దొంగిలిస్తున్నారు. 14 మంది కెపాసిటీ గల బస్సుల్లో దొంగిలించిన కేబుల్ వైర్లను తరలించారు నిందితులు. నిందితులు ఆసియాకి చెందినవారిగా పోలీసులు గుర్తించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







