'రెడ్ సీ' మీదుగా సౌదీ, ఈజిప్ట్ మధ్య బ్రిడ్జ్
- April 09, 2016
రెడ్ సీ మీదుగా ఈజిప్ట్ - సౌదీ అరేబియా మధ్య బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా వెల్లడించింది. కింగ్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఐదు రోజుల ఈజిప్ట్ పర్యటనలో ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్యా నెలకొన్న చారిత్రక సంబంధాల్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈ బ్రిడ్జ్ తోడ్పాటునందిస్తుందని ఆయన చెప్పారు. ఈజిప్టియన్ స్ట్రాంగ్ మేన్ హోస్నీ ముబారక్ చొరవతో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గతంలోనే ఆలోచనలు జరిగాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది సౌదీ పర్యాటకులు ఈజిప్ట్ని సందర్శిస్తుంటారు. అలాగే వేలాది మంది ఈజిప్టియన్లు సౌదీ అరేబియా సందర్శించడం జరుగుతుంది. ఈ కారణంగా ఇరు దేశాల మధ్యా సాంస్కకృతిక బంధం అలాగే వ్యాపార బంధం బలోపేతానికి తగు చర్యలు తీసుకుంటామని ఇరు దేశాల ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







