'రెడ్ సీ' మీదుగా సౌదీ, ఈజిప్ట్ మధ్య బ్రిడ్జ్
- April 09, 2016
రెడ్ సీ మీదుగా ఈజిప్ట్ - సౌదీ అరేబియా మధ్య బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా వెల్లడించింది. కింగ్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఐదు రోజుల ఈజిప్ట్ పర్యటనలో ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్యా నెలకొన్న చారిత్రక సంబంధాల్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈ బ్రిడ్జ్ తోడ్పాటునందిస్తుందని ఆయన చెప్పారు. ఈజిప్టియన్ స్ట్రాంగ్ మేన్ హోస్నీ ముబారక్ చొరవతో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గతంలోనే ఆలోచనలు జరిగాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది సౌదీ పర్యాటకులు ఈజిప్ట్ని సందర్శిస్తుంటారు. అలాగే వేలాది మంది ఈజిప్టియన్లు సౌదీ అరేబియా సందర్శించడం జరుగుతుంది. ఈ కారణంగా ఇరు దేశాల మధ్యా సాంస్కకృతిక బంధం అలాగే వ్యాపార బంధం బలోపేతానికి తగు చర్యలు తీసుకుంటామని ఇరు దేశాల ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









