సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష అనుమానాస్పద మృతి
- June 11, 2022
హైదరాబాద్: టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల బంజారాహిల్స్లోని తన ఇంట్లో శనివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్లో ఓ ఇంట్లో నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం, భద్రతా తనిఖీలకు ఆమె స్పందించకపోవడంతో, గార్డులు ఇంటికి చేరుకున్న పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్లో ఆమె శవమై కనిపించింది. వాష్రూమ్లో రసాయనాల బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యూష డిప్రెషన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







