తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
- June 12, 2022
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్కు ముందుకు వస్తున్నాయి. తాజాగా 24వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ముందుకు వచ్చింది. అడ్వాన్స్డ్ అమోలెడ్ డిస్ప్లేలు తయారీలో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీతో ఎంఓయూ చేసుకున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయే రోజంటూ ట్విట్ చేశారు.
తెలంగాణలో ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీల దృష్టిని హైదరాబాద్ ఆకర్షిస్తోంది. ఇప్పటికే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్ పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
దావోస్లో మంత్రి కేటీఆర్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారం గురించి కంపెనీలకు వివరించారు. దీంతో రాష్ట్రం వైపు కంపెనీల దృష్టి పడింది. అయితే తాజాగా రాజేశ్ ఎక్స్పోర్స్ట్ కంపెనీ 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







