150 మంది అనాధల్లో ఆనందాన్ని నింపిన ఎటిసలాట్
- April 09, 2016
ఎటిసలాట్ సంస్థ 150 మంది చిన్నారుల్లో ఆనందాన్ని నింపింది. అనాధల్లో ఆనందాన్ని నింపేందుకు గత మూడేళ్ళుగా పలు కార్యక్రమాలను చేపడుతున్న ఎటిసలాట్, ఈసారి కూడా అదే విధంగా ఓ ఛారిటీ కార్యక్రమం నిర్వహించింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 'డిస్నీ లైవ్ మిక్కీ మ్యూజిక్ ఫెస్టివల్'కి హాజరయ్యేందుకు 150 మంది అనాధలకు అవకాశం కల్పించింది ఎటిసలాట్ సంస్థ. ఈ సందర్భంగా వారంతా, 25 డిస్నీ క్యారెక్టర్స్ ఇచ్చిన లైవ్ పెర్ఫామెన్సెస్ని తిలకించారు. తమ అభిమాన క్యారెక్టర్లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అలాగే మంచి విందు కూడా ఇక్కడ వారికి ఏర్పాటు చేయడం జరిగింది. యూఏఈ నుంచి అల్ ఇషాన్ ఛారిటీ అసోసియేషన్, సార్జా ఛారిటీ ఇంటర్నేషనల్, దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ మరియు రాయాటి ఫ్యామిలీ సొసైటీ తదితర సంస్థలు ఈ షోకి ఆహ్వానింపబడ్డాయి. పిల్లల్లో ఆనందం చూస్తోంటే చాలా సంతోషం కలిగిందనీ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలనుకుంటున్నామని విపి కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఫేర్స్ హమాద్ ఫేర్స్ చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







