నిబంధనలు అతిక్రమిస్తే జైలే
- June 13, 2015
నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రికల్ పరికరాల్ని ఉపయోగించినా, అక్రమ కనెక్షతో విద్యుత్, నీరు పొందినా ఇకపై కఠినంగా శిక్షించేందుకు తగిన చట్టాల్ని రూపొందిస్తోంది బహ్రెయిన్ ప్రభుత్వం. ఎనర్జీ మరియు వాటర్ అథారిటీ అను నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్వే ఎంటనే పవర్నీ, నీటి కనెక్షన్నీ కట్ చేయనుంది. మొదటిసారి తప్పుకి మూడు నెలల నుంచి ఐదు నెలల జైలు శిక్ష, 1000 నుంచి 2000 బహ్రెయినీ దినార్స్ వరకూ జరీమానా.. రెండూ కలిపిగానీ, లేదంటే విడిగా గానీ అమలు చేస్తారు. ఓసారి శిక్ష పడిన తర్వాత కూడా నేరానికి పాల్పడితే శిక్ష, జరీమానా మరింతగా పెరగనున్నాయి. ఇది కాకుండా బహ్రెయిన్ పార్లమెంట్, పెరుగుతున్న విడాకుల రేటుపైనా చర్చించనుంది. తీవ్రవాదం వంటి అంశాలపైనా పార్లమెంటులో చర్చ జరుగుతుంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







