హమ్మ వసుమతీ.! రీ ఎంట్రీ వెనుక అంత పెద్ద స్కెచ్ వుందా.?
- June 15, 2022
'వసుమతీ.. వసుమతీ..' అంటూ 'భరత్ అనే నేను' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబునే తన వెంట తిప్సేసుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి తెలుగు సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ అందాల భామ. ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకీ సైన్ చేసేసింది.
అలా 'వినయ విధేయ రామ' సినిమాలో తన అంద చందాలతో మరోసారి ఆకట్టుకుంది. అయితే, సెకండ్ మూవీ రిజల్ట్ తేడా కొట్టేసరికి, మూడో సినిమా జోలికి పోలేదు కియారా అద్వానీ. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది.
లాంగ్ గ్యాప్ తర్వాత ఫ్లాప్ ఇచ్చిన చరణ్ సినిమాతోనే మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15 వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి కియారా సైన్ చేయడానికి చాలా కారణాలున్నాయట. అందులో ఒకటి ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ కావడమేనట.
బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించడమనేది అంత ఆషా మాషీ ఇష్యూ కాదు. శంకర్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఎక్కువ వుంటుందన్న సంగతి తెలిసిందే. అదే కియారా ఈ సినిమాకి సైన్ చేయడానికి మరో కారణమట.
ఏది ఏమైతేనేం, మొత్తానికి కియారా మళ్లీ తెలుగులో కాలు మోపింది. అన్నీ కలిసొచ్చి, ఈ సినిమా హిట్ అయితే, మళ్లీ మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకోవడం పక్కా. ఇకపోతే, ఇటీవలే 'భూల్ భూలయ్యా 2' సినిమాతో బాలీవుడ్లో ఓ సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







