భారత మహిళల హాకీ జట్టుకు ఊరట ..

- April 09, 2016 , by Maagulf
భారత మహిళల హాకీ జట్టుకు ఊరట ..

హాక్స్ బే కప్‌లో భారత మహిళల హాకీ జట్టుకు ఊరట లభించింది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1-0 గోల్ తేడాతో కెనడాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకిదే తొలి విజయం. టోర్నమెంట్‌లో విజయం కోసం తపిస్తోన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో లిలిమా మింజ్ గట్టెక్కించింది.43వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కార్నర్లను ఇరుజట్లు గోల్స్‌గా మలచ లేకపోయాయి. తదుపరి 5,6 స్థానాల కోసం ఆదివారం జరుగనున్న వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... ఐర్లాండ్‌తో తలపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com