భారత్ కరోనా అప్డేట్

- June 17, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువగానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 12847 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,70,577 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 63,063 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 14 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,24,817 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7985 మంది కరోనా నుంచి కోలు కున్నారు.ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,82,697 కు చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,95,84,03,471 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.ఇక గడిచిన 24 గంటల్లో 15,27,365 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com