ఉమ్ సలాల్ మార్కెట్‌లో 1,000 కిలోల చేపలు ధ్వంసం

- June 17, 2022 , by Maagulf
ఉమ్ సలాల్ మార్కెట్‌లో 1,000 కిలోల చేపలు ధ్వంసం

దోహా: ఉమ్ సలాల్ మున్సిపాలిటీలోని ఆరోగ్య నియంత్రణ విభాగం సెంట్రల్ ఫిష్ మార్కెట్‌లో 1,000 కిలోలకుపైగా చేపలను ధ్వంసం చేసింది. ఆరోగ్య నియంత్రణ విభాగం ఉమ్ సలాల్‌లోని సెంట్రల్ ఫిష్ మార్కెట్‌లో చేపట్టిన తనిఖీల్లో వినియోగానికి అనువుగా లేని సుమారు 1,155 కిలోల చేపలను గుర్తించి ధ్వంసం చేసినట్లు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో భాగంగా 207,704 కిలోల చేపలను ధ్వంసం చేసిన విషయం తెలిపిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com