అయ్యో.! సాయి పల్లవి ఎందుకలా చేసింది. అనవసరంగా కెలుక్కుంది.!
- June 17, 2022
హీరోయిన్ల యందు సాయి పల్లవి వేరయా.. అంటే అతిశయోక్తి అనిపించదు. ఎందుకంటే, ఆమె నడత, నడక, మాట.. అంతా సమ్థింగ్ డిఫరెంట్. అందుకే సాయి పల్లవి అంటే, అందరికీ ప్రత్యేకమైన అభిమానం వుంటుంది.
అయితే, ఆ అభిమానాన్ని సాయి పల్లవి కోల్పోయేలా కనిపిస్తోంది. తాజాగా ‘విరాట పర్వం’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్య్వూలో సాయి పల్లవి స్పందించింది. మతం పేరు చెప్పి, కశ్మీర్లోని హిందూ పండిట్లను హింసకు గురి చేయడం చాలా దారుణం, దుర్మార్గం అని సాయి పల్లవి ఆవేదన వ్యక్తం చేసింది.
గో సంరక్షణ పేరు చెప్పి, అన్యాయంగా గోవుల్ని తరలిస్తున్న ఓ ముశ్లిం వ్యక్తిని అడ్డగించి అతనిపై దాడి చేయడం కూడా హింసే అవుతుందని అది ఎంత మాత్రమూ సబబు కాదని, ఈ సందర్భంగా సాయి పల్లవి స్పందించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయ్.
అక్కడ కశ్మీర్లోని హిందూ పండిట్లపై జరిగే హింసకీ, ఇక్కడ గో సంరక్షకుల ఇష్యూకి ఎందుకు లింకు పెడతావంటూ, సాయి పల్లవిపై ఒకింత గుస్సా అవుతున్నారు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల విషయంలో రెస్పాండ్ అయ్యేటప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అనవసరంగా అత్యుత్సాహం చూపించి, సాయి పల్లవి ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్లయ్యింది.. అంటూ ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘విరాట పర్వం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రానాకి జంటగా ఈ సినిమాలో సాయి పల్లవి నటించింది. నవీన్ చంద్ర, ప్రియమణి, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







