'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు..
- April 10, 2016
'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో విజయోత్సవం ఆదివారం ఆర్కె బీచ్ రోడ్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను బోయపాటి శ్రీను సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు. ఈ చిత్రంలో అర్జున్ సరసన రకుల్ప్రీత్ సింగ్, కేథరిన్ నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందించారు. ఈ నెలలో సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









