'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు..
- April 10, 2016
'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో విజయోత్సవం ఆదివారం ఆర్కె బీచ్ రోడ్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను బోయపాటి శ్రీను సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు. ఈ చిత్రంలో అర్జున్ సరసన రకుల్ప్రీత్ సింగ్, కేథరిన్ నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందించారు. ఈ నెలలో సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







