'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు..
- April 10, 2016
'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో విజయోత్సవం ఆదివారం ఆర్కె బీచ్ రోడ్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను బోయపాటి శ్రీను సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు. ఈ చిత్రంలో అర్జున్ సరసన రకుల్ప్రీత్ సింగ్, కేథరిన్ నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందించారు. ఈ నెలలో సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









