దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016
- April 10, 2016
ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా తుది పోటీలు శనివారం రాత్రి ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఫైనల్కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షారుక్ ఖాన్ విజేత పేరు ప్రకటించారు. బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్గా నిలవగా, లఖ్నవూకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్గా నిలిచింది.ఈ సందర్భంగా 'ఫ్యాన్' చిత్రంలోని జబ్రా పాటకు నృత్యం చేసి షారుఖ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సంజయ్దత్, యామీ గౌతమ్, అర్జున్కపూర్, కబీర్ ఖాన్, అమీ జాక్సన్, 2015 మిస్ వరల్డ్ మిరేయా లలాగున, టెన్నిస్ స్టార్ సానియామీర్జా, దర్శక నిర్మాత ఏక్తాకపూర్, డిజైనర్లు మనీశ్ మల్హోత్ర, షేన్ పీకాక్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. దర్శకుడు కరణ్జోహార్, మనీశ్ పాల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్నారు. వరుణ్ధావన్, షాహిద్కపూర్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ నృత్య ప్రదర్శనలతో వీక్షకులను ఉర్రూతలూగించారు. పోటీదారుల దుస్తులను అంజు మోదీ, నమత్ర జోషిపుర, ఫాల్గుణి, షేన్ పీకాక్లు డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







