వెంకయ్య నాయుడితో పెద్దల భేటీ..సర్వత్రా ఉత్కంఠ..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ?
- June 21, 2022
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనన్న వేళ… ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు.
ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వారి మధ్య సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. నేటి రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగనుంది.
నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైనే వెంకయ్య నాయుడితో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నిలుస్తారా? లేదా ఉప రాష్ట్రపతిగా కొనసాగుతారా? అనే అంశాలపై వెంకయ్యతో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టులో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







