వెంకయ్య నాయుడితో పెద్దల భేటీ..సర్వత్రా ఉత్కంఠ..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ?
- June 21, 2022
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనన్న వేళ… ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు.
ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వారి మధ్య సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. నేటి రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగనుంది.
నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైనే వెంకయ్య నాయుడితో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నిలుస్తారా? లేదా ఉప రాష్ట్రపతిగా కొనసాగుతారా? అనే అంశాలపై వెంకయ్యతో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టులో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు