భారత్ కరోనా అప్డేట్
- June 22, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కోవిడ్ భారిన పడ్డారు. 13మంది కోవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం మొత్తం 3,10,623 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 81,687కు చేరింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 0.19 శాతంగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనా భారిన పడినవారి సంఖ్య 4,33,31,645కు చేరింది.
ఇదిలా ఉంటే కరోనాతో చికిత్స పొందుతూ 24గంటల్లో 13 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,24,903కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 9,862 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055 కు చేరింది. ఇక దేశంలో రికవరీ రేటు 98.60శాతంగా నమోదైంది. కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారత్ లో 523 రోజులుగా టీకా పంపిణీ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 196.45 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. మంగళవారం ఒక్కరోజే 12,28,291 డోసుల టీకాలు వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా అందజేశారు.
ఇదిలా ఉంటే ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85,88,36,977 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,437 ప్రభుత్వ లాబ్స్,1955 ప్రైవేట్ లాబ్స్ మొత్తం 3,392 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ







