నాన్-ఖతారీ యాజమాన్యంలో బ్యాంకుల పెంపు.. క్యాబినెట్ ఆమోదం
- June 23, 2022దోహా: ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అధ్యక్షతన అమిరి దివాన్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ప్రతిపాదన ఆధారంగా స్టాక్ ఎక్స్ఛేంజ్లో లీస్ట్ అయిన కొన్ని బ్యాంకులు, కంపెనీల మూలధనంలో ఖతారీయేతర పెట్టుబడిదారుల యాజమాన్యం శాతాన్ని పెంచడానికి మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం.. ఖతారీయేతర పెట్టుబడిదారు కింద ఉన్న బ్యాంకులు, కంపెనీల మూలధనంలో 100% వరకు పెంచుకునే అవకాశం ఏర్పడనుంది. క్యాబినెట్ తాజా నిర్ణయంతో 1- ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, 2- దోహా బ్యాంక్, 3- మెడికేర్ గ్రూప్, 4- ఖతార్ గ్యాస్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (నకిలత్), 5- ఖతార్ ఫ్యూయల్ కంపెనీ (వోకోడ్) బ్యాంకులు, కంపెనీలకు లబ్ధి కలుగనుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన