నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు బంద్
- June 24, 2022దోహా: ఖతార్లో నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించనున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు నవంబర్ 15 నుండి అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువులను ప్యాకేజింగ్ చేయడం, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, మోసుకెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్లు, కాగితంతో చేసిన బ్యాగ్లు లేదా క్లాత్ బ్యాగులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో తయారు చేసిన బ్యాగులను వాడాలని సూచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ డైరెక్టర్ అహ్మద్ యూసఫ్ అల్ ఇమాది, వేస్ట్ రీసైక్లింగ్ అండ్ ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎంగ్ హమద్ జాసిమ్ అల్ బహర్, అల్ వక్రా మునిసిపాలిటీ డైరెక్టర్ ఇంజి ముహమ్మద్ హసన్ అల్ నుయిమి, పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!