భార్య పై కోపంతో కుమారుడితో సహా భర్త ఆత్మహత్య

- June 24, 2022 , by Maagulf
భార్య పై కోపంతో కుమారుడితో సహా భర్త ఆత్మహత్య

బహ్రెయిన్: భార్యపై కోపంతో కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇండియాలోని కేరళలో చోటు చేసుకుంది. మృతులను కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన ప్రకాష్ దేవరాజన్ (48), అతని కుమారుడు శివదేవ్‌గా గుర్తించారు. తన 11 ఏళ్ల కుమారుడిని కారులో తీసుకెళ్లిన ప్రకాశ్..  డీజిల్ ట్యాంకర్ లారీని ఢీకొట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తమ మరణానికి తన భార్య, స్నేహితులే కారణమంటూ ప్రకాష్ తన సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రకాష్ భార్య బహ్రెయిన్ లో ఉంటుంది. ఆమె ఇండియాకు తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ, ఆమె అతని మాట వినకపోవడంతో.. కుమారుడితో సహా తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు ప్రకాష్ రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఈ ఘటనపై కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com