భార్య పై కోపంతో కుమారుడితో సహా భర్త ఆత్మహత్య
- June 24, 2022
బహ్రెయిన్: భార్యపై కోపంతో కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇండియాలోని కేరళలో చోటు చేసుకుంది. మృతులను కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన ప్రకాష్ దేవరాజన్ (48), అతని కుమారుడు శివదేవ్గా గుర్తించారు. తన 11 ఏళ్ల కుమారుడిని కారులో తీసుకెళ్లిన ప్రకాశ్.. డీజిల్ ట్యాంకర్ లారీని ఢీకొట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తమ మరణానికి తన భార్య, స్నేహితులే కారణమంటూ ప్రకాష్ తన సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రకాష్ భార్య బహ్రెయిన్ లో ఉంటుంది. ఆమె ఇండియాకు తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ, ఆమె అతని మాట వినకపోవడంతో.. కుమారుడితో సహా తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు ప్రకాష్ రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఈ ఘటనపై కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!