ప్రయాణాలకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దు
- June 25, 2022
దుబాయ్: గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షలు విధించిన కారణంగా పర్యాటకుల సందడి లేక వెలవెలబోయిన దుబాయ్ ఈ సంవత్సరం వేసవి కాలంలో వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా తమ ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దు అని దుబాయ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలీసులు ఈ విజ్ఞప్తి చేయడానికి ముఖ్య కారణం ఒక ప్రముఖ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తన ప్రయాణ వివరాలు పోస్ట్ చేసిన వెంటనే అతను/ఆమెకు సంబంధించిన వస్తువులను దొంగతనం చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు.
దుబాయ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయ్యద్ అల్ హాజ్రి మాట్లాడుతూ" విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ యొక్క బోర్డింగ్ పాస్ మరియు ఇతరత్రా సమాచారాన్ని సరదాగా సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వాటిని ఆధారంగా చేసుకుని వారి గుర్తింపును దొంగిలించేందుకు కొందరు నేరస్తులు ప్రయత్నిస్తున్నారు " అని పేర్కొన్నారు.
హాజ్రీ కొనసాగిస్తూ తమ వ్యక్తిగత మరియు ప్రయాణాలకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ద్వారా ఆయా మాధ్యమాల్లో తమను అనుసరించేవారు పెరుగుతారని భావిస్తున్న వారికి నేను చెప్పేది ఏమిటంటే, ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లుకు మీరే స్వయంగా మిమల్ని దొచుకోమని ఆహ్వానిస్తున్నారు. దీని వల్ల మీరు దీర్ఘ కాలంలో చాలా నష్టాలు చవిచూస్తారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







