ఏటీఎంలోని వ్యక్తిపై దాడి.. నగదును దోచుకున్న వ్యక్తి అరెస్ట్
- June 26, 2022
బహ్రెయిన్: సనద్లోని ఏటీఎం వద్ద 39 ఏళ్ల బహ్రెయిన్ జాతీయుడిపై దాడి చేసి నగదు దోచుకున్న 22 ఏళ్ల ఆఫ్రికన్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ తెలిపింది. ఈ ఘటనలో ఉన్న రెండో నిందితుడి కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ వీడియోలో ఏటీఎంలో ఓ వ్యక్తితో బలవంతంగా నగదు డ్రా చేయించి తీసుకోవడం, ఆ తర్వాత అక్కడినుంచి వారు పరారు కావడం కన్పించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







