జర్మనీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- June 26, 2022
జర్మనీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు.జర్మనీలోని మ్యునిఖ్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. జర్మనీలో జరిగే జీ7 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సు నేడు, రేపు జరగనుంది. జీ7 దేశాలతో పాటు అతిథి దేశాల అధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై వారు చర్చిస్తారు.
జర్మనీలోని మ్యునిఖ్లో నేటి సాయంత్రం ఓ కమ్యూనిటీ కార్యక్రమంలోనూ ప్రసంగిస్తారు. జర్మనీ పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ యూఏఈకి వెళ్ళనున్నారు. కాగా, వాతావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, లింగ వివక్ష, ప్రజాస్వామ్యం అంశాలపై జీ7 సదస్సులో చర్చిస్తామని ప్రధాని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు, నేడు జర్మనీ నుంచే రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్లో మోదీ మాట్లాడనున్నారు.



తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







