జర్మనీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- June 26, 2022
జర్మనీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు.జర్మనీలోని మ్యునిఖ్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. జర్మనీలో జరిగే జీ7 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సు నేడు, రేపు జరగనుంది. జీ7 దేశాలతో పాటు అతిథి దేశాల అధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై వారు చర్చిస్తారు.
జర్మనీలోని మ్యునిఖ్లో నేటి సాయంత్రం ఓ కమ్యూనిటీ కార్యక్రమంలోనూ ప్రసంగిస్తారు. జర్మనీ పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ యూఏఈకి వెళ్ళనున్నారు. కాగా, వాతావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, లింగ వివక్ష, ప్రజాస్వామ్యం అంశాలపై జీ7 సదస్సులో చర్చిస్తామని ప్రధాని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు, నేడు జర్మనీ నుంచే రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్లో మోదీ మాట్లాడనున్నారు.



తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







