ప్రమాదాల్లో 5 ఏళ్లలో 2,500 మంది మృత్యువాత
- June 27, 2022
కువైట్: దేశంలో గత ఐదేళ్లలో కారు ప్రమాదాల కారణంగా 2,500 మంది మరణించారని కువైట్ సొసైటీ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ హెడ్ బాదర్ అల్-మతార్ వెల్లడించారు. గత ఏప్రిల్ వరకు రెండేళ్లలో (2021/2022) ప్రమాదాల కారణంగా 711 మంది పౌరులు, నివాసితులు మరణించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ట్రాఫిక్ ప్రమాదాల తీవ్రతకు ఇది అద్దం పడుతుందని, జీవితాలను, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి చర్య తీసుకోవాలని సేఫ్టీ హెడ్ బాదర్ అల్-మతార్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల అధికారుల నేతృత్వంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప ట్రాఫిక్ ప్రమాదాల నిర్మూలన జరగదని, దేశంలోని కొన్ని ట్రాఫిక్ సమస్యలపై పునరాలోచన చేయడంతో పాటు ట్రాఫిక్ అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయడం ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చని ఆయన సూచించారు. రహదారి ట్రాఫిక్ మర్యాదలు, చట్టాలు, నిబంధనలు, నియమాలను పాటించడం.. వంటి వాటికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అల్-మతార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







