ఖతార్ లో కొత్తగా 610 కేసులు నమోదు
- June 28, 2022దోహా: ఖతార్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 610 కొత్త కమ్యూనిటీ కేసులు నమోదు కాగా.. ఇందులో 58 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడు రోజుల్లో తొలి మరణం కూడా నమోదైంది. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 679కి చేరుకుంది. ప్రస్తుతం 4,873 యాక్టివ్ కేసులున్నాయి. ఖతార్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 380,530కు చేరుకుంది. రోజువారీ సగటు కోలుకున్న కేసుల సంఖ్య 457గా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 1,682,286 బూస్టర్ డోసులు అందించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 6,974,984కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 58 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు