ఖతార్ లో కొత్తగా 610 కేసులు నమోదు
- June 28, 2022దోహా: ఖతార్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 610 కొత్త కమ్యూనిటీ కేసులు నమోదు కాగా.. ఇందులో 58 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడు రోజుల్లో తొలి మరణం కూడా నమోదైంది. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 679కి చేరుకుంది. ప్రస్తుతం 4,873 యాక్టివ్ కేసులున్నాయి. ఖతార్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 380,530కు చేరుకుంది. రోజువారీ సగటు కోలుకున్న కేసుల సంఖ్య 457గా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 1,682,286 బూస్టర్ డోసులు అందించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 6,974,984కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 58 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు