ఈద్ అల్-అధా సెలవులు.. ప్రయాణీకులకు సలహాలు
- June 30, 2022
దోహా: జూన్ 30, 2022 నుండి దోహా నుండి అధిక సంఖ్యలో ప్రయాణీకులు బయలుదేరుతారు. అలాగే జూలై నుండి దోహాకు తిరిగి వచ్చే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈద్ అల్-అధా సెలవుల కోసం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) ప్రయాణీకులకు పలు సూచనలు జారీ చేసింది.
-ప్రయాణీకులు కర్బ్ సైడ్కు బదులుగా స్వల్పకాలిక కార్ పార్కింగ్లో పికప్, డ్రాప్లను నిర్వహించాలని సూచించారు.
-కాంప్లిమెంటరీ కార్ పార్క్ సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు.
-ఆన్లైన్లో చెక్-ఇన్ చేయాలని, విమానయానానికి 3 గంటల ముందుగా ఎయిర్ పోర్టు చేరుకోవాలన్నారు. ముందస్తు చెక్-ఇన్ సేవలను పొందాలని సూచించారు.
-ఖతార్ ఎయిర్వేస్ కస్టమర్లు సెల్ఫ్-సర్వీస్ చెక్-ఇన్, బ్యాగ్-డ్రాప్ సౌకర్యాలను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇ-గేట్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు.
-ప్రయాణికులు తమ నిర్దిష్ట విమానయాన సంస్థ నుండి బ్యాగేజీ మార్గదర్శకాలను ముందుగానే తెలుసుకోవాలన్నారు.
-బ్యాగేజీ రీప్యాక్ ఏరియా ప్రయాణికులకు డిపార్చర్ హాల్లో లగేజీ వెయింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
-సెక్యూరిటీ స్క్రీనింగ్కు ముందు గడియారాలు, బెల్ట్లు, వాలెట్లు, ఆభరణాలు వంటి వ్యక్తిగత వస్తువులను ట్రేలలో వదులుగా ఉంచకుండా బ్యాగ్ లోపల సురక్షితంగా పెట్టుకోవాలని సూచించారు.
-మొబైల్ ఫోన్ల కంటే పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగ్ల నుండి తీసి ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ట్రేలలో పెట్టాలన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







