అక్టోబర్లో మెటావర్స్ లో మొదటి ఆసుపత్రి ప్రారంభం
- June 30, 2022
యూఏఈ: హెల్త్ కేర్ సంస్థ థంబే గ్రూప్ రాబోయే కొద్ది నెలల్లో యూఏఈలో తమ మొదటి ఆసుపత్రిని మెటావర్స్ లో భాగంగా ప్రారంభించనుంది. ఈ సంవత్సరం అక్టోబర్లోపు పూర్తి వర్చువల్ హాస్పిటల్ పూర్తి అవుతుందని సంస్థ ప్రకటించింది. మెడికల్ టూరిజంను దృష్టిలో పెట్టుకొని రోగులకు మెరుగైన సేవలందించేందుకు తుంబే హెల్త్కేర్ ఫెసిలిటీ సేవలు విస్తరిస్తున్నామని తుంబే గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ తుంబే మొయిదీన్ అన్నారు. యూఏఈ హెల్త్ కేర్ సంస్థ తన వైద్యులందరికీ మెటావర్స్ లో రోగులతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థను నియమించిందన్నారు. గ్రూప్ హాస్పిటల్ సిస్టమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానం చేస్తోందని, దీని ద్వారా కెమెరాలు రోగి కారు నంబర్ ప్లేట్ను, ఆసుపత్రిలోకి ప్రవేశించినప్పుడు అతని ముఖాన్ని గుర్తిస్తాయని తంబే గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్బర్ మొయిదీన్ చెప్పారు. ఒక రోగి రిసెప్షన్ వద్దకు వచ్చినప్పుడు, అప్పటికే అతనికి సంబంధించిన ఫైల్ డాక్టర్ల చెంతకు చేరుతుందన్నారు. డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ ఆటోమెటిక్ గా ఫార్మసీకి వెళుతుందని వివరించారు.పేషెంట్ సేవలు, మెడిసిన్ తోసహా అంతా డిజిటల్ గా పూర్తవుతుందన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







