ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
- July 02, 2022
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్తో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో కలిసి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోడీ కి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్టర్లో మోడీ బయలుదేరే దాకా తలసాని అక్కడే ఉండిపోయారు.
మోడీ కి స్వాగతం పలికే సందర్భంగా గవర్నర్, పలువురు బీజేపీ నేతలు వరుసగా నిలుచుండగా… టీఆర్ఎస్కు చెందిన తలసాని ఒక్కరు మాత్రమే వేరేగా కనిపించారు. ఎందుకంటే… అప్పటికే మోడీ కంటే ముందుగానే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకోగా…సీఎం కేసీఆర్ సహా కేటీఆర్ ఇతర మంత్రులు, పార్టీ నేతలంతా కలిసి సిన్హాతో పాటే జల విహార్కు వెళ్లిపోయారు. అయితే నగరానికి చెందిన మంత్రి కావడంతో తన పార్టీ నేతలంతా జల విహార్కు వెళ్లిపోయినా తలసాని ఒక్కరు మాత్రం మోడీ కి ఆహ్వానం పలికేందుకు బేగంపేటలోనే ఉండిపోయారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







