ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
- July 02, 2022
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్తో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో కలిసి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోడీ కి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్టర్లో మోడీ బయలుదేరే దాకా తలసాని అక్కడే ఉండిపోయారు.
మోడీ కి స్వాగతం పలికే సందర్భంగా గవర్నర్, పలువురు బీజేపీ నేతలు వరుసగా నిలుచుండగా… టీఆర్ఎస్కు చెందిన తలసాని ఒక్కరు మాత్రమే వేరేగా కనిపించారు. ఎందుకంటే… అప్పటికే మోడీ కంటే ముందుగానే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకోగా…సీఎం కేసీఆర్ సహా కేటీఆర్ ఇతర మంత్రులు, పార్టీ నేతలంతా కలిసి సిన్హాతో పాటే జల విహార్కు వెళ్లిపోయారు. అయితే నగరానికి చెందిన మంత్రి కావడంతో తన పార్టీ నేతలంతా జల విహార్కు వెళ్లిపోయినా తలసాని ఒక్కరు మాత్రం మోడీ కి ఆహ్వానం పలికేందుకు బేగంపేటలోనే ఉండిపోయారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







