ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
- July 02, 2022
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్తో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో కలిసి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోడీ కి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్టర్లో మోడీ బయలుదేరే దాకా తలసాని అక్కడే ఉండిపోయారు.
మోడీ కి స్వాగతం పలికే సందర్భంగా గవర్నర్, పలువురు బీజేపీ నేతలు వరుసగా నిలుచుండగా… టీఆర్ఎస్కు చెందిన తలసాని ఒక్కరు మాత్రమే వేరేగా కనిపించారు. ఎందుకంటే… అప్పటికే మోడీ కంటే ముందుగానే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకోగా…సీఎం కేసీఆర్ సహా కేటీఆర్ ఇతర మంత్రులు, పార్టీ నేతలంతా కలిసి సిన్హాతో పాటే జల విహార్కు వెళ్లిపోయారు. అయితే నగరానికి చెందిన మంత్రి కావడంతో తన పార్టీ నేతలంతా జల విహార్కు వెళ్లిపోయినా తలసాని ఒక్కరు మాత్రం మోడీ కి ఆహ్వానం పలికేందుకు బేగంపేటలోనే ఉండిపోయారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









