ఎమెర్జెన్సీ లైట్లను వాడటం పై హెచ్చరించిన దుబాయ్ పోలీసులు
- July 02, 2022
దుబాయ్: ఎమెర్జెన్సీ లైట్లను వాడటం పై నగర పౌరులను మరియు వాహన చోదకులను దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పోలిస్ ఎమెర్జెన్సీ లైట్లను పెట్టుకొని రెండు కార్లు రోడ్ల మీద నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఈ హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్న కల్నల్ జుమా బిన్ సువైదాన్ మాట్లాడుతూ పౌరుల భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో వాహన చోదకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతూనే ఈ చర్యలు చేపట్టకుండా ఉండాలంటే ట్రాఫిక్ చట్టాలను అతిక్రమణ చేయకూడదని పేర్కొన్నారు.
ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ఎమెర్జెన్సీ లైట్లను పెట్టుకొని రోడ్ల పై నిర్లక్ష్యంగా నడిపిన ఆ రెండు కార్లు యాజమానుల పై చర్యల గురించి మాట్లాడుతూ ఆ రెండు కార్లలో ఒకటి ఏమిరెట్స్ రోడ్డులో ,మరొకటి షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ రోడ్డు లో మా సిబ్బంది గమనించారు. వారి మీద శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







