షార్జా,దుబాయ్ నగరాల్లో పెరిగిన టాక్సీ రేట్లు
- July 03, 2022
యూఏఈ: జూలై నెలలో యూఏఈ వ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు అమల్లోకి రావడంతో షార్జా మరియు దుబాయ్ నగరాల్లో ట్యాక్సీ రేట్లు పెంచడం జరిగింది.
టాక్సీ రేట్ల పెంపు గురించి దుబాయ్ రోడ్లు మరియు రవాణా సంస్థ (RTA) ప్రతినిధి మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా కిలో మీటర్ల లెక్కన టాక్సీ రేట్లు పెంచడం జరిగింది కానీ వీటి పెంపు ద్వారా ఏటువంటి అదనపు భారం ప్రజల మీద పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
షార్జా రోడ్లు మరియు రవాణా సంస్థ (SRTA) ప్రతినిధి బృందం మాట్లాడుతూ ప్రతి నెల యూఏఈ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో ప్రకటించే ఇంధన ధరల మధ్య జరిగే హెచ్చు తగ్గులు కారణంగా టాక్సీ రేట్లలో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని ప్రకటిస్తూనే ట్యాక్సీ దారులు నుంచి అధిక రేట్ల ను వసూలు చేయడం జరిగింది. ఒకవేళ సంస్థ నిర్దేశించిన ధరలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే పెరిగిన ఇంధన ధరల కారణంగా టాక్సీ రేట్లు మాత్రమే పెరిగాయి తప్పించి దుబాయ్ అధ్వర్యంలో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థ మరియు మెట్రో రైళ్ల లో రేట్లను పెంచలేదని ప్రకటించింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లు వసూలు చేసిన ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టాక్సీ రేట్లను పెంచడంతో ప్రముఖ టాక్సీ బుకింగ్ సంస్థ ఉబర్ సైతం తన రేట్లలో మార్పులు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







