పవన్ జనవాణికి విశేష స్పందన..
- July 03, 2022
హైదరాబాద్: జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, బాధితులు భారీగా వచ్చారని జనసేన నేతలు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. ఇప్పటివరకు 400కు పైగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు పవన్.
పవన్ స్వీకరించిన ఫిర్యాదుల సమాచారాన్ని జనసేన సిబ్బంది కంప్యూటర్ లో నమోదు చేసుకుంటున్నారు. వినతులు, ఫిర్యాదులు అందించిన బాధితులకు జనసేన సిబ్బంది రసీదు అందజేసింది. ఫిర్యాదులను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు జనసేన తెలిపింది.

తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









