ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
- July 04, 2022
కులూ : హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది.దీంతో పాఠశాల విద్యార్థులు సహా 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి.
వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నుజ్జునుజ్జయింది.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







