ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
- July 04, 2022
కులూ : హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది.దీంతో పాఠశాల విద్యార్థులు సహా 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి.
వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నుజ్జునుజ్జయింది.ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







