డెన్మార్క్ రాజధానిలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి..
- July 04, 2022
కొపెన్హగన్: డెన్మార్క్ రాజధాని కొపెన్హగన్ తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఓ షాపింగ్మాల్లో దూరిన దుండగుడు సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సంఘటనతో షాపింగ్మాల్ దగ్గర భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధం వినిపించగానే అక్కడి వారిలో కొందరు దుకాణాల్లో దాక్కోగా.. మరికొందరు తొక్కిసలాట మధ్య పరుగులు తీశారు. 22 ఏళ్ల దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం లేదని కొట్టిపారేయలేమన్నారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామన్నారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









