ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
- July 05, 2022
ఏపీ: ఏపీలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల (ఆగస్టు)లో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను గౌతమ్ సవాంగ్ విజయవాడలో మంగళవారం వెల్లడించారు. 2018 సంవత్సరంలో 167 గ్రూప్-1 పోస్టుల (30పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు) భర్తీకి ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్టింది. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు.
డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత టాప్-1లో నిలిచారు. వైఎస్సార్ జిల్లా కోతులగుట్టపల్లికి చెందిన కె. శ్రీనివాసరాజు టాప్-2లో నిలవగా, హైదరాబాద్ కు చెందిన సంజన సింహ టాప్ -3లో నిలిచారు. మొదటి పది స్థానాల్లో ఏడుగురు మహిళలు ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను ఏపీపీఎస్సీ కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. 2018 గ్రూప్-1 పరీక్షలకు మొత్తం లక్షా నలభై వేల మంది హాజరయ్యారని, స్క్రీనింగ్ టెస్ట్కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారని సవాంగ్ తెలిపారు. 167 గ్రూప్-1 పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారని అన్నారు. అయితే వచ్చే నెలలో 110 గ్రూప్-1 పోస్టులకు, 182 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు. ఈ నెల 24న దేవాదాయశాఖలో ఈవో పోస్టులకు, రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుందని, రాబోయే కాలంలో మరో 13నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







