రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..

- July 06, 2022 , by Maagulf
రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..

న్యూఢిల్లీ: పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌,వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.రాష్ట్రపతి కోటాలో వీళ్లను నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది.

వీళ్ల నామినేట్‌ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో స్వయంగా ప్రకటించారు. ఆయా రంగాల్లో వాళ్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. వాళ్లను రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com