మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్పాట్ కొట్టిన ఇండియన్ టెకీ
- July 07, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారతీయ ఐటీ ఇంజనీర్ జాక్పాట్ కొట్టాడు. దుబాయ్లో తాజాగా నిర్వహించిన మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారత ప్రవాసుడు అనీష్ 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.గడిచిన ఏడాది కాలంగా క్రమం తప్పకుండా మహజూజ్లో పాల్గొంటున్న అనీష్కు తాజాగా అదృష్టం వరించింది.శనివారం(జూలై 2న) దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.తాజాగా దుబాయ్లో మహజూజ్ ప్రధాన కార్యాలయంలో దీని తాలూకు చెక్ను ర్యాఫిల్ నిర్వాహకులు అనీష్కు అందజేశారు.
ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ..ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.ఇప్పటికీ తన ఫ్యామిలీ స్వదేశంలోనే ఉందని, వెంటనే వారిని యూఏఈకి తీసుకొచ్చి హ్యాపీగా ఉంటామని చెప్పాడు.ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అలాగే కొనసాగుతానని చెప్పిన అతడు..ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.కానీ, తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన అప్పులు తీరడంతో పాటు తన పిల్లల భవిష్యత్ కూడా బాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







