మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్పాట్ కొట్టిన ఇండియన్ టెకీ
- July 07, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారతీయ ఐటీ ఇంజనీర్ జాక్పాట్ కొట్టాడు. దుబాయ్లో తాజాగా నిర్వహించిన మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారత ప్రవాసుడు అనీష్ 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.గడిచిన ఏడాది కాలంగా క్రమం తప్పకుండా మహజూజ్లో పాల్గొంటున్న అనీష్కు తాజాగా అదృష్టం వరించింది.శనివారం(జూలై 2న) దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.తాజాగా దుబాయ్లో మహజూజ్ ప్రధాన కార్యాలయంలో దీని తాలూకు చెక్ను ర్యాఫిల్ నిర్వాహకులు అనీష్కు అందజేశారు.
ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ..ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.ఇప్పటికీ తన ఫ్యామిలీ స్వదేశంలోనే ఉందని, వెంటనే వారిని యూఏఈకి తీసుకొచ్చి హ్యాపీగా ఉంటామని చెప్పాడు.ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అలాగే కొనసాగుతానని చెప్పిన అతడు..ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.కానీ, తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన అప్పులు తీరడంతో పాటు తన పిల్లల భవిష్యత్ కూడా బాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









