సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- July 07, 2022
హైదరబాద్: శంషాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు శాఫ్రాన్ నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్లో శాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు.
ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి వెయ్యి మంది దాకా ఉపాధి లభిస్తుందన్నారు. శాఫ్రాన్ నిర్ణయం హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. ఆవిష్కరణల కోసం టీ హబ్ వంటి ప్లాట్ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







